
షాకింగ్ గా ఉంది కదూ!? : ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్లో హీరోయిన్గా 46 ఏళ్ల నటి!
2025 ముగిసేలోపు బాలీవుడ్ అభిమానులకు ఓ అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చింది. ఈ ఏడాది టాలీవుడ్ను ఊపేసిన సంక్రాంతి బ్లాక్బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పుడు బాలీవుడ్లో కొత్త రూపంలోకి రాబోతుండటం ఆసక్తిని రేపుతోంది. పండగ సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు లాగిన ఈ సినిమా, హ్యూమర్, ఎమోషన్, రిలేషన్షిప్స్ను బలంగా మిక్స్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే కథ హిందీ ప్రేక్షకుల ముందుకు రీమేక్గా రావడం హాట్ టాపిక్గా మారింది.
ఈ రీమేక్లో ప్రధాన పాత్రలో బాలీవుడ్ సూపర్స్టార్ అక్షయ్ కుమార్ నటించనున్నారని సమాచారం. 58 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న అక్షయ్ ఖాతాలోకి ఓ పక్కా కామెడీ ఎంటర్టైనర్ చేరడం అభిమానుల్లో జోష్ పెంచుతోంది. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నది సౌత్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. తెలుగు నుంచి హిందీకి ఈ రీమేక్ వెళ్లడం, దానికి దిల్ రాజు లాంటి నిర్మాత అండగా ఉండటం ప్రాజెక్ట్పై భారీ అంచనాలు పెంచింది.
ఇక హీరోయిన్ విషయంలో కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా 46 ఏళ్ల నటి విద్యా బాలన్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్షయ్ కుమార్, విద్యా బాలన్ కాంబినేషన్ కొత్తది కాదు. ‘హే బేబీ’, ‘భూల్ భులయ్యా’, ‘థ్యాంక్యూ’, ‘మిషన్ మంగళ్’ వంటి హిట్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ముఖ్యంగా ‘మిషన్ మంగళ్’ తర్వాత 2019 నుంచి వీళ్లిద్దరూ కలిసి కనిపించలేదు. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ జోడీ స్క్రీన్పై కనిపిస్తే, ఆడియన్స్కు డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.
మొత్తానికి, టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పుడు బాలీవుడ్లో అక్షయ్ కుమార్, విద్యా బాలన్ జోడీతో రీమేక్ అవుతుండటం సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారి తీసింది. పండగ హిట్ కథ, స్టార్ కాస్ట్, సౌత్ స్టార్ ప్రొడ్యూసర్ కలయికతో ఈ ప్రాజెక్ట్ నిజమైతే, 2026లో మరో పెద్ద ఎంటర్టైనర్ థియేటర్లలో సందడి చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
