ఇప్పుడు దేశ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే, అది మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న #SSMB29. ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి కొత్త సినిమా అంటేనే ఒక అంతర్జాతీయ స్దాయి… దానికి మహేష్ బాబు మాస్+క్లాస్ ఇమేజ్ జతకలిస్తే, ఆ అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.

ఇక తాజాగా ఈ పాన్ వరల్డ్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు ఆర్. మాధవన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అసాదే ఈ చిత్రంలో మరో ప్రముఖ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్, అలాగే బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అడవిలో జరిగే ఎడ్వెంచర్స్ యాక్షన్ ఎపిసోడ్‌లతో ఈ సినిమా ప్రపంచ స్థాయి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోంది.

ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే రాజమౌళి కొన్ని అంతర్జాతీయ లొకేషన్లను ఫైనల్ చేసినట్లు సమాచారం.

, , , ,
You may also like
Latest Posts from