
“డ్యూడ్” టీంకి కోర్టు షాక్! – ఇళయరాజా విజయం, పాటలు వెంటనే డిలీట్ ఆర్డర్!
ప్రదీప్ రంగరాజన్ హీరోగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన “డ్యూడ్” ఈ మధ్యకాలంలో వచ్చిన సాలిడ్ బ్లాక్బస్టర్లలో టాప్లో నిలిచింది. రిలీజ్ అయ్యి వారం కావడానికి ముందే సినిమా 100 కోట్ల గ్రాస్ అందుకోవడం అంటే ఆ హైప్ స్థాయి ఏంటో చెప్పడానికి చాలు. కానీ… ఈ బ్లాక్బస్టర్ రన్ సెలబ్రేషన్కి సడెన్గా బ్రేక్ పడింది.
ఇళయరాజా డైరెక్ట్గా కోర్ట్కి! – “కాపీక్యాట్ ట్యూన్స్” అంటున్న లెజెండ్
మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా ఓపెన్గా ఆరోపించారు – “డ్యూడ్ లో రెండు పాటలు నా క్లాసిక్ ట్రాక్స్ నుంచి నేరుగా లిఫ్ట్ చేశారు” అని. అనుమతి లేకుండా, కాపీరైట్ రూల్స్ని పట్టించుకోకుండా సినిమా టీమ్ ట్యూన్స్ మార్చి వాడేశారన్నది ఆయన వాదన. ఇది చిన్న విషయం కాదు — ఇళయరాజా వర్సెస్ మైత్రి మూవీ మేకర్స్ కేసు మద్రాస్ హైకోర్ట్ వరకూ వెళ్లింది.
జడ్జి నేరుగా ఇళయరాజానే ప్రశ్నించారు!
విచారణలో న్యాయమూర్తి మొదట ఇళయరాజాని అడిగిన ప్రశ్నే వైరల్ అయింది: “30 ఏళ్ల క్రితం వచ్చిన పాటలను మళ్లీ వినిపిస్తే తప్పేంటి?”
కానీ ఇళయరాజా లాయర్ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు: “కాపీరైట్ ఉన్న పాటలను అనుమతి లేకుండా వాడటం నేరం.”
మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ చెప్పింది: “సోనీ నుంచి హక్కులు తీసుకున్నాం.” కానీ ఇళయరాజా లాయర్ స్ట్రైట్గా చెప్పారు –“ఆ హక్కులు మీకు దాఖలవ్వలేదు. లీగల్గా మీ వద్ద ఏ ప్రూఫ్ లేదు.”
ఫైనల్ తీర్పు: మైత్రికే భారీ షాక్ – పాటలు వెంటనే తొలగించాలి!
ఇద్దరి వాదనలు విన్న తర్వాత కోర్టు షాకింగ్ ఆర్డర్ ఇచ్చింది:
“డూడ్ నుంచి ఆ రెండు పాటలను వెంటనే తొలగించాలి!”
మైత్రి మూవీ మేకర్స్ 7 రోజుల సమయం కోరినా కోర్టు స్ట్రైట్గా రిజెక్ట్ చేసింది. అంటే… ఇంత పెద్ద హిట్ రన్లో ఉన్న సినిమా నుంచి రెండు పాటలు నైట్ఫుల్గా రిమూవ్ చేయాలన్నమాట!
కోర్టు ఇంకా ఒక ఆసక్తికరమైన కామెంట్ కూడా చేసింది: “పాత పాటలను స్ఫూర్తిగా తీసుకోవచ్చు… కానీ పాటల పవిత్రత దెబ్బతీయకూడదు.” విచారణను జనవరి 7కి వాయిదా వేసింది.
“డ్యూడ్” స్టోరీ గురించి చిన్న రీక్యాప్ :
కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అగన్ (ప్రదీప్) & కురల్ (మమిత) ప్రేమ కథ. బోల్డ్ పాయింట్లు, మ్యూజికల్ వైబ్, మాస్ కనెక్ట్—all helped it become a smash hit.
ఈ బ్లాక్బస్టర్ అక్టోబర్ 17న విడుదలై, నవంబర్ 14 నుంచి Netflixలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది.
