తమిళ స్టార్ హీరోలు ఇప్పుడు తెలుగు ప్రొడ్యూసర్ల కొత్త ఆకర్షణగా మారిపోయారు. మార్కెట్ ఎలా ఉన్నా, రేమ్యూనరేషన్ ఎంతైనా ఇవ్వడానికి టాలీవుడ్ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ధనుష్ తర్వాత ఇప్పుడు శింబు (సిలంబరసన్‌) కూడా తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు!

ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ శింబుతో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని ప్లాన్ చేస్తోంది. ‘మనసనమహా’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దీపక్ రెడ్డి ఒక ప్రత్యేకమైన కథా ఆలోచనతో వచ్చాడట, దాంతో ప్రొడ్యూసర్లు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.

ప్రస్తుతం చర్చలు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఫైనాన్షియల్స్ సెట్ అయితే త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే సితార బ్యానర్‌ — ధనుష్‌, దుల్కర్ సల్మాన్‌తో హిట్స్ కొట్టగా, సూర్య తొలి తెలుగు సినిమా కూడా ఈ బ్యానర్‌లోనే షూట్ అవుతోంది.

శింబు సినిమా కూడా అదే లైన్‌లో ఉండబోతోందట. ఆయన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయ్యాక ఈ బైలింగ్వల్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభమవుతుందని సమాచారం.

శింబు టాలీవుడ్ ఎంట్రీతో కొత్త ట్రెండ్ సెట్ అవుతుందా?
ఫ్యాన్స్, ఇండస్ట్రీలో అందరి దృష్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పైనే!

#deepak reddy, #Silambarasan TR, #Simbu, #Sithara Entertainments, #Tollywood

By admin