సినిమా వార్తలు

క్షమాపణతో ‘గేమ్ ఛేంజర్’ వివాదానికి ముగింపు

గత కొన్ని రోజులుగా “గేమ్ ఛేంజర్” సినిమా చుట్టూ చిన్ని చిన్ని మాటలతో పెద్ద వాతావరణమే ఏర్పడింది. నిర్మాత శిరీష్‌ చేసిన వ్యాఖ్యలపై రామ్‌చరణ్‌ అభిమానులు తీవ్రంగా స్పందించడంతో ఈ వివాదం టాలీవుడ్‌ను కుదిపేసింది. అయితే ఇప్పుడు శిరీష్‌ ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెబుతూ స్నేహం, గౌరవం, అనుబంధం మాటలు వినిపించడంతో… ఈ వివాదానికి పూర్తిగా తెరపడిందా? అనే చర్చ మొదలైంది.

“చరణ్‌ అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆయనను కించపరచాలనే ఉద్దేశం నాలో లేదుకాదు. మా మాటల్లో ఓ తడబాటు జరిగింది. ఇది నా ఫస్ట్‌ ఇంటర్వ్యూకాబట్టి మాట కాస్త దూసుకుపోయింది” అంటూ శిరీష్‌ ఓపికగా వివరణ ఇచ్చారు. ఆయన చెప్పినట్లే – “చరణ్‌, చిరంజీవి, మా సంస్థకు అనుబంధం గాఢంగా ఉంది. మేము వరుణ్‌తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లతో సినిమాలు చేశాం. చిరంజీవి గారితో మంచి సంబంధం ఉంది. అలాంటప్పుడు చరణ్‌ను అవమానించే ఉద్దేశం ఎక్కడ ఉంటుంది?”

శిరీష్‌ మాటల్లో ఒక విషయం స్పష్టంగా కనిపించింది – అది చరణ్‌ అభిమానుల మనోభావాల పట్ల గౌరవం. “అభిమానుల బాధను అర్థం చేసుకోగలను. చరణ్‌ వంటి మంచి మనసున్న వ్యక్తిని మేమే ఎందుకు బాధపెట్టాలి? ఆయన ఆమోదం లేకుండా సంక్రాంతికి మా సినిమా విడుదలయ్యేది కాదు” అని చెప్పటం ద్వారా, అసలు గొడవకు మించిన గౌరవాన్ని చరణ్‌కు సమర్పించారు.

అంతేకాదు, మరోసారి రామ్‌చరణ్‌తో సినిమా చేయబోతున్నట్లు కూడా షాక్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ఫ్యాన్స్‌ కోపాన్ని ప్రేమగా కప్పిన ఈ వీడియో మెగా క్యాంప్‌తో తమ అనుబంధాన్ని తిరిగి చాటిచెప్పింది.

ఇక ఈ వివాదానికి క్లారిటీ వచ్చిందా? అభిమానుల కోపానికి క్షమాపణ చలనం ఇచ్చిందా?
ఇది సమాధానం కంటే అనుభూతి… కానీ శిరీష్‌ చూపించిన మార్పు మాత్రం స్పష్టంగా కనిపించింది.

Similar Posts