ఇద్దరు పిల్లల తల్లైనప్పటికీ… నయనతార కెరీర్‌లో ఇప్పుడు తగ్గేదేలే అన్నట్లుగా ఒక కొత్త జోష్ తో స్పీడ్ గా దూసుకుపోతోంది. తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగుతోంది. సీనియర్ హీరో అయినా… జూనియర్ అయినా… నయన్ కెమెరా ముందుకు రావడంలో వెనకడుగు వేయడం లేదు.

తాజాగా నయనతార, మెగాస్టార్ చిరంజీవితో హ్యాట్రిక్‌ చేయబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది నయనతారకు చిరుతో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్ కావడం విశేషం.

ప్రమోషన్ వీడియోతో సడన్ సెన్సేషన్!

సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార, ఈ సినిమా విషయంలో మాత్రం ఓ వైరల్ ప్రమోషన్ వీడియోతో ముందుగానే తెరపైకి వచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి చెన్నై వెళ్లి ఆమెతో షూట్ చేసిన వీడియో… సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన కొందరు తమిళ నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు: “తెలుగు సినిమాలు ఇంత ఇష్టమా? అయితే టాలీవుడ్‌కి షిఫ్ట్ అవ్వండి!” అంటూ విమర్శలు గుప్పించారు.

ఈ ట్రోల్స్‌కు నయనతార తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు:

“అనవసరమైన విషయాల కోసం నా టైమ్ వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నా కన్‌వీనియన్స్ బట్టి ప్రమోషన్లకు వెళ్తాను. అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ఎవరికీ దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.” అని కౌంటర్ ఇచ్చారు. నయన్ దెబ్బకి ఈసారి ట్రోల్స్ కూడా సైలెంట్ అయ్యాయి.

, ,
You may also like
Latest Posts from