బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అందుకు ఆమె వేసిన డిమాండ్ల వల్లే చిత్ర టీమ్ ఆమెను తప్పించిందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ముఖ్యంగా వర్కింగ్ అవర్స్‌పై ఆమె స్పష్టమైన షరతులు, రూ.25 కోట్ల పారితోషికం డిమాండ్ వంటివే దీనికి కారణమన్న ప్రచారం జరిగింది.

ఈ వ్యవహారంపై తాజాగా ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీపికా చర్యలను సమర్థిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు:

“నేను 500 మంది సిబ్బందితో కలిసి పనిచేస్తున్నాను. వారికి కూడా సొంత జీవితాలు ఉంటాయి. వారి ఆరోగ్యం కూడా ముఖ్యమే. వర్కింగ్‌ అవర్స్‌ విషయంలో దీపికా డిమాండ్‌ న్యాయమే. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లు కూడా 8 గంటల షిఫ్ట్‌లోనే పని చేస్తారు.

దీపికా విషయంలో ఇది ఎందుకు తప్పుగా పరిగణిస్తున్నారో అర్థం కావడం లేదు. దీన్ని నిరాకరించడానికి దర్శకులకు సరైన కారణం ఉండాలి. సినిమా రంగంలో ఉన్నవారు షూటింగ్‌ల కోసం వారి వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయాలనే విషయాన్ని నేను అంగీకరించను. నేనెప్పుడూ 12 గంటలకు మించి షూటింగ్‌ చేయలేదు. అలాగే, ఆదివారాల్లోనూ షూటింగ్ చేయను” అని స్పష్టం చేశారు.

పారితోషికం అంశంలో కూడా స్పష్టత

దీపికా అడిగిన రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ గురించి స్పందించిన కబీర్ ఖాన్ –

“స్టార్డమ్ ఉన్నవారు ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. పారితోషికం అనేది వ్యక్తులపై కాదు… వాళ్ల మార్కెట్ వాల్యూ మీద ఆధారపడుతుంది” అని అన్నారు.

ప్రస్తుతం దీపికా ఈ ప్రాజెక్ట్‌పై అధికారికంగా ఎటువంటి స్పందన ఇవ్వకపోయినా, బాలీవుడ్‌లో ఉన్న కొందరు సెలబ్రిటీలు ఈ అంశంపై పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. వేదికలపై కానీ, ఇంటర్వ్యూలలో కానీ దీని గురించి ఓపెన్‌గా మాట్లాడుతుండటం ఆసక్తికరంగా మారింది.

ఇక, దీపికా వర్క్ ఎథిక్స్‌పై ఇలా ఓ స్టార్ డైరెక్టర్ ఈ స్థాయిలో ఓపెన్‌గా మాట్లాడటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మరిన్ని రియాక్షన్లు వస్తే, ఈ వివాదం ఇంకా బిగుస్తుందేమో చూడాలి!

, , , ,
You may also like
Latest Posts from