‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’తో యూత్‌ఫుల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ… ఇప్పుడు కొత్త సినిమాతో రెడీ అవుతున్నారు. రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందుతున్న ‘తెలుసు క‌దా’ చిత్రం ద్వారా ఆయన మళ్లీ ప్రేక్షకుల హృదయాలను గెలవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇటీవల విడుదలైన ‘జాక్’ సినిమాతో ఓవర్ కాన్ఫిడెన్స్ బురదలో కాలు పెట్టిన సిద్ధు… ఈసారి భద్రంగా అడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఈ సినిమాలోని ఒక మజా ఏమిటంటే… చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నీరజ్ కోన ఇప్పటివరకు ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్న వారు. ఇప్పుడు మాత్రం తొలిసారి డైరెక్టర్ గా మారి మెగా ఫోన్ పట్టారు. ఇది ఫస్ట్ ఫిలిం కావడంతో నీరజ్ కోనకే కాదు, సిద్ధుకూ ఇదొక రిస్క్ ఛాన్స్‌ అని చెప్పాలి.

‘తెలుసు క‌దా’ సినిమా రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ దీపావళికి అంటే అక్టోబర్ 17న ‘తెలుసు కదా’ థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. విడుదలైన ప్రోమో వీడియో మాత్రం హార్ట్‌టచ్ చేసే రొమాంటిక్ టోన్‌తో ఆకట్టుకుంటోంది.

హీరోయిన్ల విషయంలోనూ సినిమా పక్కా ప్లాన్‌తోనే ముందడుగు వేసింది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి జోడీగా నటిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టీజీ విశ్వప్రసాద్ చేతుల్లో ఉన్నాయి.

కానీ ప్రశ్న మాత్రం ఇదే — ‘జాక్’ ఫ్లాప్ తర్వాత, సిద్ధు మళ్లీ మేజిక్ రిపీట్ చేయగలరా? ‘తెలుసు కదా’ సినిమా కోసం ఫైనల్‌గా సిద్ధు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేస్తారా? అభిమానుల ఆశల్ని పెంచేలా ట్రైలర్ వస్తుందా?

, , ,
You may also like
Latest Posts from