2010లో వచ్చినప్పుడు పెద్దగా ఎప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. కానీ… సినిమాలో డైలాగులు అర్థమయ్యేలోపే – బాక్సాఫీస్ కింద బోల్తా పడింది ఖలేజా.

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్, ఓ క్లాస్ కథ, ఓ క్లాసికల్ స్క్రీన్‌ప్లే… అది అప్పట్లో విఫలమయినా, కాలమే దానికి న్యాయం చేసింది.

15 ఏళ్ల తర్వాత…
4K వెర్షన్‌లో మళ్లీ తెరపైకి వచ్చింది ఈ అద్భుతం.
కానీ… చిత్రంగా “సండే మండే సాంగ్ లేదు!” అలాగే “నాలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు…” డైలాగ్ మిస్సింగ్! . “చేస్తే కామెడీ నేనే చేయాలి…” అన్న సీన్‌ పోయింది!

అభిమానులు ఆశతో థియేటర్‌కి వెళ్తే… వాళ్ల ఫీలింగ్స్‌కి ఫుల్ బ్రేక్ పడింది.. దాంతో థియేటర్లలో గొడవలు, ప్రొజెక్షనిస్ట్‌తో వాదనలు… వీటన్నిటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫ్యాన్స్ రచ్చ రేపారు. వైరల్ వీడియోల్లో ఒక్క మాటే చెబుతున్నారు – “ముందే చెప్పాలి కదా.. ఏం కట్ చేశారో!”

ఈ రియాక్షన్ వల్లే కదా… ఖలేజా టీమ్ “మిస్సయిన సీన్స్ మళ్లీ జోడించాం…”అంటూ దిగి వచ్చి ప్రకటించింది.

కానీ ఫ్యాన్స్ ఏమంటున్నారు?
“మా థియేటర్‌లో ఇంకా అవే కట్ వర్షన్‌…”

2010లో మిస్ అయిన గౌరవం. 2025లో అభిమానుల చల్లని రివెంజ్!
ఒక్కోసారి సినిమాల విలువను గ్రహించడానికి, 15 ఏళ్లు పడుతుంది!

, , , ,
You may also like
Latest Posts from