పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా “They Call Him OG”. ఈ చిత్రం షూటింగ్ ను పవన్ ఇటీవలే తన పార్ట్ను పూర్తి చేశారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలోనే కాదు, ట్రేడ్ వర్గాల్లోనూ విపరీతమైన హైప్ నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు సొంతం చేసుకునేందుకు దృష్టిపెట్టినట్టు సమాచారం.
OG సినిమాకు టాలీవుడ్ ట్రేడ్లో భారీ క్రేజ్
ఇండస్ట్రీ లేటెస్ట్ బజ్ ప్రకారం, ….నాగ వంశీ ఇప్పటికే OG సినిమా నైజాం రైట్స్ను కొనుగోలు చేశారని, భారీ అడ్వాన్స్ చెల్లించినట్టు చెబుతున్నారు. ఈ డీల్ పూర్తిగా అడ్వాన్స్ బేసిస్ మీద ఫిక్స్ అయినట్టు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కూడా నాగ వంశీ చర్చలు జరుపుతున్నారట.
అంటే మొత్తంగా చెప్పాలంటే, పవన్ OG సినిమాకు తెలుగు రాష్ట్రాల పూర్తి హక్కులపై నాగ వంశీ ఫోకస్ పెట్టినట్టే. గతంలో కూడా ఇదే విధంగా ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకు నాగ వంశీ తెలుగు రాష్ట్రాల రైట్స్ కొనుగోలు చేసి, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించారు.
పాన్ ఇండియా రేంజ్లోనే నాగ వంశీ ఆఫర్!
‘OG’ రైట్స్ కోసం నాగ వంశీ ఇచ్చిన ఆఫర్, పాన్ ఇండియా లెవెల్ బిగ్ బడ్జెట్ చిత్రాల రేంజ్లో ఉందని సమాచారం. భారీ డిమాండ్ మధ్య వంశీ ఇలా అడ్వాన్స్తో ముందుకెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్లు OG సినిమాపై అంచనాలను ఆకాశానికే ఎత్తేశాయి. ఈ ఏడాది అత్యంత భారీ తెలుగు రిలీజ్గా OG ఖచ్చితంగా నిలవబోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో OG బిజినెస్ మీద ఇప్పుడు నాగ వంశీ గేమ్ ప్లాన్ హాట్ టాపిక్ అవుతోంది!