భారీ విజువల్స్, అద్భుతమైన సెట్ పీసెస్, టెక్నికల్ ఎక్సలెన్స్ – ఇవన్నీ ఎస్ఎస్ రాజమౌళి సినిమాల ప్రత్యేకత. ఈగలో మాక్రో లెవెల్ CGI నుండి, బాహుబలిలో హాలీవుడ్ స్థాయి VFX వరకు, RRRలో రియల్ స్టంట్స్కి డిజిటల్ మాయాజాలం కలిపి చూపించడం వరకు… రాజమౌళి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని, దాన్ని తన కథనానికి సరిపడేలా మలచడంలో మాస్టర్. అందుకే ఆయన సినిమా అంటే కేవలం ఒక మూవీ కాదు, అది ఒక విజువల్ ఈవెంట్.
ఇప్పుడు ఆయన సూపర్స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న SSMB29 కూడా అదే స్థాయి ఇన్నోవేషన్తో వస్తుందనే టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి, ‘గ్లోబ్ ట్రాటర్’ కాన్సెప్ట్కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ నవంబర్లో రానుంది.
అసలు విషయం ఏమిటంటే – ఈ సినిమాలో రాజమౌళి బ్లూ-స్క్రీన్ టెక్నాలజీని వాడబోతున్నాడట. మొదట కెన్యాలోని నేషనల్ పార్క్స్లో షూట్ ప్లాన్ చేశారు. అయితే అక్కడి రాజకీయ ఉద్రిక్తతల కారణంగా, షూటింగ్ను టాంజానియాలోని సెరెంగెటి అడవుల వైపు మళ్లించారని సమాచారం. అంతేకాకుండా, ఆఫ్రికా అడవులను గ్రాఫిక్స్ ద్వారా రియలిస్టిక్గా రీక్రియేట్ చేయడానికీ రాజమౌళి సిద్ధమవుతున్నాడట.
బ్లూ-స్క్రీన్ టెక్నాలజీ అంటే ఏమిటి?
ఇది సినిమా మేకింగ్లో ఒక ప్రత్యేక పద్ధతి, ఇందులో బ్యాక్గ్రౌండ్ని పూర్తిగా నీలం రంగుతో షూట్ చేసి, ఆ నీలం రంగును పోస్ట్ ప్రొడక్షన్లో గ్రాఫిక్స్ లేదా వాస్తవ లొకేషన్లతో రీప్లేస్ చేస్తారు. దీని వల్ల ఏ లొకేషన్కైనా వెళ్లకుండానే, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాన్ని కూడా సెట్ మీదే రియలిస్టిక్గా క్రియేట్ చేయవచ్చు.
అంటే, వాతావరణం, లైట్, యాక్షన్ అన్నీ కంట్రోల్లో ఉంచుకుంటూ, ఊహకతీతమైన విజువల్స్ అందించగల శక్తి ఈ టెక్నాలజీకి ఉంది. ఇక రాజమౌళి చేతిలో ఈ బ్లూ-స్క్రీన్ మ్యాజిక్ అంటే… 2025లో మనం మరొక సినిమాటిక్ వండర్ చూడబోతున్నామన్నమాట!
ఈ టెక్నాలజీ వాడకం వల్ల – కథలో కావాల్సిన ఏ లొకేషన్ అయినా వాతావరణం, లైట్, యాక్షన్కి అనుగుణంగా డిజైన్ చేసుకోవచ్చు. అంటే మిగతా సినిమాల్లా సహజసిద్ధత కోల్పోకుండా, విపరీతమైన కంట్రోల్ రాజమౌళి చేతుల్లోనే ఉంటుంది.
మహేశ్ – రాజమౌళి కాంబోలో ఈ బ్లూ-స్క్రీన్ మ్యాజిక్ ఎలా కనిపిస్తుందో, నవంబర్ ఫస్ట్ లుక్దాకా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు!